చిలిపిచెడ్, ఏప్రిల్ 17: ట్రాఫిక్ స్కూల్స్ అందరు పాటించాలని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని శిలంపల్లి గ్రామంలో సర్పంచ్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి చేతుల మీదుగా గ్రామస్తులకు 100 హెల్మెట్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశంలో 1,30,000 చనిపోతున్నారని తెలంగాణలో 7000 మంది, మెదక్ జిల్లాలో 600 నుంచి 700 మంది చనిపోయారని ఆయన అన్నారు.
ఎస్పీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నర్సింలు, ఉప సర్పంచ్ కిష్టారెడ్డి, నవీన్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.