సదాశివపేట, జనవరి 17 : క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మండలంలోని కోనాపూర్లో పట్లోళ్ల శివనాగప్ప మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీని ఆయన ప్రారంభించిన ప్రభాకర్ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. యువతను ప్రోత్సహిస్తూ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసిందన్నారు.
దాదాపు 28 టీమ్లు టోర్నీలో పాల్గొనడం సంతోషకరమన్నారు. శివనాగప్ప మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం డీఎస్పీ రవీందర్రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ మనోహర్చక్రవర్తి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, కార్యదర్శి ఆరీఫొద్దీన్, సర్పంచ్ శోభారాణీ సంగన్న, ఫౌండేషన్ చైర్మన్ పట్లోళ్ల చంద్రశేఖర్, మేనేజింగ్ ట్రస్టీ పట్లోళ్ల నందీశ్వర్, ఎంపీటీసీ అల్లం లలిత, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మునిగె నవీన్, సర్పంచులు ఏసయ్య, శేఖర్, నగేశ్, సలావొద్దీన్, మాజీ సర్పంచులు మాణిక్, అంజన్న, అనిల్రెడ్డి, భాస్కర్, మల్లేశం, రియాసత్, రమేశ్, వీరమల్లేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.