సంగారెడ్డి, జూన్ 13: పార్టీ సైనికులకు ఏ ఆపద వచ్చినా కాపాడుకుంటామని, అకస్మాత్తుగా మృతి చెందితే బీమాతో ఆదుకుంటామని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కంది మండలం కలివేముల గ్రామానికి చెందిన బంటు శ్రీనివాస్ ప్రమాదంలో మృతి చెందితే రూ.2 లక్షల చెక్కును అతడి భార్య కృష్ణవేణికి అందజేశారు. ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని సభ్యత్వం తెలంగాణలో బీఆర్ఎస్కు ఉందన్నారు.
60 లక్షల సభ్యత్వాలతో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నదన్నారు. పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా బీమా సౌకర్యం కల్పించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరూ రశీదును జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని, మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, జడ్పీటీసీ కొండల్రెడ్డి, కంది ఎంపీపీ సరళ, సర్పంచ్ విమల, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ముస్తాఫా, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు, చక్రపాణి, నాయకులు వీరేశం, యూనూస్, పరశురామ్ నాయక్, దిడ్డి విఠల్ తదితరులు ఉన్నారు.
బీఆర్ఎస్లో కాంగ్రెస్ నేతల చేరిక
నిజాంపేట, జూన్ 13: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సమక్షంలో మంగళవారం నస్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు అశోక్, సురేశ్, రాజు, రమేశ్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ సిద్ధిరాములు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసే ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నస్కల్ ఎస్సీ మాల కులస్తుల భవన నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి, నాయకులు ఎల్లం, రాజు, మోహన్రెడ్డి, మాలలు యాదయ్య, సంజీవ్, నాగయ్య, అంజయ్య, రాజు, సురేశ్ ఉన్నారు.
రైతులకు రసీదులు ఇవ్వాలి
కోహీర్, జూన్ 13: మందులను కొనుగోలు చేసే రైతులందరికీ తప్పకుండా రసీదులు ఇవ్వాలని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి పుష్పరాణి ఫర్టిలైజర్ డీలర్లను ఆదేశించారు. మంగళవారం వ్యవసాయ శాఖ, టాస్క్ఫోర్స్, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోహీర్ పట్టణంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలతో పాటు కవేలి, దిగ్వాల్ దుకాణాల్లో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిబంధనలు పాటించని డీలర్ల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆమె వెంట ఏడీఏ భిక్షపతి, ఏవో నవీన్కుమార్, ఎస్సై అంబాజీ ఉన్నారు.