జగదేవ్పూర్, ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో శివాజీ జయంతిని పురస్కరించుకొని శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఎంపీ ప్రారంభించారు. అంతకుముందు ఎల్లమ్మ గుడి నుంచి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా శివాజీ అందరినీ ఆదరించేవాడని, ఒక క్రమశిక్షణతో పలు రాజ్యాలను జయించి ఆదర్శంగా నిలిచారన్నారు. కానీ, కొన్ని పార్టీల నాయకులు విగ్రహాలకు మతం, కులం పేరుతో నీచరాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని మంచి చెడును గుర్తించాలని ప్రజలకు నిస్వార్థ సేవలు అందించిన శివాజీ పరాక్రమాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్ కులమతాలకు అతీతంగా అన్నివర్గాల ప్రజలను ఆదరిస్తున్నారని తెలిపారు. హిందూ దేవాలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
యాదా ద్రి, వేములవాడ ఇప్పుడు కొండగట్టు దేవాలయానికి పెద్దఎత్తున నిధులు వెచ్చించి దేశంలోనే గొప్ప దేవాలయాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. రెండు పర్యాయాలు కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసే అవకాశం జగదేవ్పూర్ వాసులకు వచ్చిందని, ఇప్పుడు దేశ్కీ నేతగా కేసీఆర్ వెళ్తున్నారని ఆయనకు ప్రతిఒక్కరి ప్రజల ఆశీర్వాదం అందించాలని సూచించారు. అనంతరం విగ్రహ దాత ఆత్మకమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డి, శివాజీ యూత్ సభ్యుల కనకయ్య, బాలకృష్ణను ఎంపీ అభినందించారు. అంతకుముందు కొత్తపేట అలిరాజ్పేట గ్రామాల్లో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి శివాజీ విగ్రహాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలేశంగౌడ్, గజ్వేల్, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్లు జహంగీర్, మాదాసు శ్రీను, సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ కవిత, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, సర్పంచులు నరేశ్, చంద్రశేఖర్, ఎంపీటీసీలు దర్గయ్య, నాయకులు రాజు, నాగరాజు, కనకయ్య పాల్గొన్నారు.