నినాదాలతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శివాజీ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. నినాదాలతో పల్లెలు, పట్టణాలు హోరెత్తాయి. శోభాయాత్రలతోపాటు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించారు. గజ్వేల్ పట్టణంలోని పిడిచేడ్ మార్గంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, దుబ్బాక పట్టణంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఛత్రపతి విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. నేటి యువత శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.