న్యాల్కల్, మార్చి 21: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలో భాగంగా మద్యం, డబ్బు ఇతర విలువైన వస్తువులు, సామగ్రి అక్రమంగా తరలించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సంగారెడ్డి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లోని ప్రధాన రోడ్డు మార్గాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి పోలీసు, ఎక్సైజ్ అధికాలు తనిఖీలు చేస్తున్నారు. జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల పరిధిలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన గుల్బర్గా, బీదర్, ఉద్గీర్, చించోలి తాలూకాలున్నాయి. అయి తే తెలంగాణ- కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని 65వ జాతీయ రహదారిపై చిరాగ్పల్లి-మడ్గి, మొగుడంపల్లి మం డలం గౌసాబాద్ తండా, న్యాల్కల్ మండలంలోని హుస్సేలి, కోహీర్ మండలం మనియర్పల్లి, సిద్దాపూర్ తండా సరిహద్దు ప్రాంతంలో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఆయా పోలీస్స్టేషన్ పరిధిలోని పోలీసు అధికారులు, సీఆర్పీఎఫ్ బలగాలతో ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనులకు తావులేకుండా లోక్సభ ఎన్నికల సందర్భంగా జహీరాబాద్లో ఎక్సైజ్, పోలీసు శాఖ కర్ణాటక పోలీసులు అధికారులతో అంతర్రాష్ట్ర సరిహద్దు మైత్రి సమావేశాలు నిర్వహిస్తూ అక్రమంగా డబ్బు, మద్యం తలించకుండా చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటక ప్రాంతాల నుంచి తెలంగాణలోని వస్తున్న ప్రతి వాహనాన్ని చెక్పోస్ట్టు వద్ద పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఆయా ప్రాం తాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో జహీరాబాద్ డీఎస్పీ రా మ్మెహన్రెడ్డి ఆధ్వర్యంలో జహీరాబాద్, జహీరాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలోని పోలీసు సిబ్బంది షిప్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల సందర్భంగా అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టు నుంచి అక్రమంగా మద్యం, నగదు, విలువైన వస్తువులు తరలించకుండా ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నాం. కర్ణాటక నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి వాహనాన్ని కుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాం. జహీరాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలోని చెక్పోస్టుల వద్ద షిప్టుల వారీగా పోలీసులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా నగదు, వెండి, బం గారం అభరణాలు పెద్దమొత్తంలో ఉంటే స్వాధీనం చేసుకుంటాం. ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.