చిలిపిచెడ్, జనవరి 31: మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో 41వ వార్షికోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఉత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకుడు ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో 50 మంది వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మెదక్ జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.