నవభారత నిర్మాణ ప్రదాత, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో వేడుకలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తూ, జై భీమ్ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా సాగారు. జయంతి వేడుకల్లో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆయా సంఘాల నేతలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా, సంగారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, కలెక్టర్ శరత్, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, అదనపు ఎస్పీ ఉషా విశ్వనాథ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి నివాళులర్పించారు.
షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి జగదీశ్వర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక జీకేఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఎస్పీ సైదులు, వివిధ సంఘాల నాయకులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. – మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, ఏప్రిల్ 14