తొగుట : దుబ్బాక మున్సిపాలిటీతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం (BRS victory ) సాధించడం పట్ల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు స్వామి గౌడ్ ( Swamy Goud ) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
ఆయన మాట్లాడుతూ దుబ్బాక అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డా అని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ ఎన్నికలతో పాటు మున్సిపాటిటీల్లో మంచి మెజారిటీ అందించారని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పులిగారి శివయ్య, ఉపసర్పంచ్ లచ్చోళ్ళ లింగం నాయకులు సుతారి రాములు, పాత్కుల బాలేష్, పులిగారి లక్ష్మణ్, జహంగీర్, ఎంగలి నరేందర్, వడ్డె నర్సింలు, బెజ్జనమైన కనకరాజు, సుతారి రాంబాబు, టంకరి లింగం, పాత్కుల ఆంజనేయులు, రాములు, లక్ష్మణ్, పులిగారి భాస్కర్, గణేష్, మధు తదితరులు పాల్గొన్నారు.