సంగారెడ్డి, డిసెంబర్ 13: సమాజంలో పలు రకాల కేసుల్లో నేరం చేసిన వారికి శిక్ష పడితేనే నేరాలు తగ్గుతాయని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని, పెండింగ్ కేసుల పరిష్కారం త్వరగా పూర్తిచేయాలని ఎస్పీ చెన్నూరి రూపేశ్ అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల ఛేదనకు పోలీసు అధికారులు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకొని విచారణ చేయాలన్నారు. కాలనీలు, పట్టణాలు, గ్రామాల్లో చోరీలను అరికట్టేందుకు ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రోత్సహించాలని సూచించారు. పెండింగ్లో(అండర్ ఇన్వెస్టిగేషన్)లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల దర్యాప్తులో వేగంపెంచి దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నేరస్తులను న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని ఎస్హెచ్వోలకు ఆదేశించారు. కేడీ, సస్పెక్ట్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని, అలవాటుపడిన నేరగాళ్లను బైండోవర్ చేయాలన్నారు.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్స్పార్ట్లుగా గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలకు రోడ్డు నిర్మాణ లోపాలున్నైట్లెతే సంబంధిత అధికారులకు తెలియజేసి మరమ్మతులు చేయించాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలపై తరచూ అవగాహన కలిగించాలన్నారు. బైక్ రైడర్స్ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన లేమి, డబ్బులు ఫ్రీగా వస్తాయని, చెప్పగానే అశపడి సైబర్ నేరగాళ్లకు ఓటీపీ, పాస్వర్డ్ చెప్పడం, ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలకు దూరంగా ఉండాలని సూచించారు. అనవసర లింకులు ఓపెన్ చేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైనైట్లెతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. సమీక్ష సమావేశంలో సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్, డీసీఆర్బీ డీఎస్పీ ఇన్స్పెక్టర్ రమేశ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ శివలింగం, సంగారెడ్డి సబ్డివిజన్ సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.