చేగుంట, నవంబర్ 7 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థ్ధి కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలుపించుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కొత్త ప్రభాకర్రెడ్డి తనయుడు కొత్త పృథ్వీరెడ్డి అన్నారు. చేగుంటలో మంగళవారం నాయకులతో కలిసి ఇంటిం టా ప్రచారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మొదన్నారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి ఎన్నికల ప్రచారంలో కత్తిదాడి చాలా బాధాకరమని, మంచి చేసే వ్యక్తిపై దాడి జరగడం దుర దృష్టకరమన్నారు. ఆయన వెంట ఎంపీపీ మాసు ల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, మం డల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగయ్యగారి రాజిరెడ్డి, జీవన్రెడ్డి,మోహన్రెడ్డి, నాయిని రాజ్గోపాల్, వెంకటనర్సింహరెడ్డి, నారాయణరెడ్డి,తానీషా, అంజిరెడ్డి, ఎర్ర యాదగిరి, సోమ సత్యనారాయణ, రవి, ఆలీ, నదీం, క్రాంతి, నరేశ్, ఎంపీటీసీలు గణేశ్, నవీన్, బక్కి రమేశ్, వెంకటి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
బీజేపీకి చెందిన గొల్లపల్లి ఉప సర్పంచ్ అనసూయవెంకటస్వామితో పాటు చేర్యాల మహేందర్రెడ్డి తదితరులు, బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఎంపీపీ, జడ్పీటీసీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.