కొల్చారం/చిలిపిచెడ్/వెల్దుర్తి/నర్సాపూర్/శివ్వంపేట/, నవంబర్ 23: కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దని, ఎన్నికలప్పుడే వచ్చి కల్లిబొల్లి మాటలు చెబుతారని బీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల ఇన్చార్జి గాలి అనిల్కుమార్ అన్నారు. కొల్చారం మండల వ్యాప్తంగా శనివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. రంగంపేటలో గాలి అనిల్కుమార్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ అరిగె రమేశ్కుమార్, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు బండి రమేశ్తో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. 30 తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకే వేసి సునీతారెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే కొల్చారంలో ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, ముత్యం ప్రవీణ్కుమార్, రాజాగౌడ్ పాల్గొన్నారు. చిన్నాఘన్పూర్లో ఇంటింటికీ ప్రచారంలో సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, ఏడుపాయల డైరెక్టర్ బాగారెడ్డి, సర్పంచ్ ఇందిరా ప్రియదర్శిని, సొసైటీ వైస్ చైర్మన్ పిల్లెల రాజాగౌడ్, పోతంశెట్పల్లి గ్రామంలో సర్పంచ్ నాగరాణి నర్సింహులు, ఎంపీటీసీ భాగ్యలక్ష్మీసిద్దిరాములు, మాజీ సర్పంచ్ చిట్యాల యాదయ్య, ఏడుపాయల డైరెక్టర్ యాదాగౌడ్, మాజీ డైరెక్టర్ గౌరీశంకర్ పాల్గొన్నారు.
* కాంగ్రెస్, బీజేపీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని చిలిపిచెడ్ మండల ఇన్చార్జి జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మన్సూర్ పిలుపునిచ్చారు. శనివారం చిలిపిచెడ్ పార్టీ కార్యాలయంలో మండల బీఆర్ఎస్ ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులతో కలిసి ఫైజాబాద్, బండపోతుగల్ గ్రామాల్లో ఇంటింటి ప్రచారంలో మన్సూర్ పాల్గొన్నారు. ప్రజలు కారు గుర్తుకు ఓటేసి నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రాంచెంద్రారెడ్డి, మండల కో అప్షన్ సభ్యుడు షఫీయొద్దీన్, చిట్కుల్ సర్పంచ్ గోపాల్రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సోమక్కపేట, చిట్కుల్, జగ్గంపేట ప్రజలకు ఈవీఎంలతో కారు గుర్తును సోమక్కపేట సర్పంచ్, మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్ శనివారం ఇంటింటా ప్రచారం చేశారు.
* రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభు త్వ సంక్షేమ, అభివృద్ధే పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని మాసాయిపేట మండల ఇన్చార్జ్, శివ్వంపేట ఎం పీపీ హరికృష్ణ ధీమా వ్యక్తం చేశారు. శనివారం మాసాయిపేట మండలంలోని రామంతాపూర్తండాలో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ గోపి, నాయకులు మోహన్రెడ్డి, శ్రీనునాయక్లతో కలిసి ఇంటింటి ప్రచా రం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలలోపాటు మ్యానిఫెస్టోను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి సునీతారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.
* నర్సాపూర్ మండలంలోని నాగులపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకుడు జీవన్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బ్రాహ్మణపల్లిలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సత్యాగౌడ్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కారు గుర్తుకు ఓటేసి సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, ఏసు, కిషన్, శ్రీనివాస్గౌడ్, కమ్మరి రాజు, కమ్మరి నర్సింలు, నీరుడి శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.
* శివ్వంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం ఎంపీపీ కల్లూరి కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ ఆధ్వర్యంలో గడపగడపకూ తిరుగుతూ కారు గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచులు పెంజర్ల శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, బాబురావు, స్వరాజ్యలక్ష్మి, శ్రీనివాస్గౌడ్, ఎంపీటీసీలు సత్తిరెడ్డి, గోవింద్నాయక్, బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం, మాజీ వైస్ ఎంపీపీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.