నంగునూరు, ఏప్రిల్ 17: మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని మహారాష్ట్ర సోలాపూర్లోని తుల్జాపూర్ తుల్జాభవానీ మాతకు బీఆర్ఎస్ నాయకులు ముడుపు కట్టారు. బుధవారం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ సంగు పురేందర్, బీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు అనంతారం రఘుపతి, సోలాపూర్ బీఆర్ఎస్ నాయకులు రఘురాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.