కొల్చారం, నవంబర్ 2 : కొల్చారం మండలంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. ఊరూరా డప్పుచప్పుళ్ల మధ్య నృత్యం చేస్తూ ఘనస్వాగతం పలికారు. మండలంలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, అంసాన్పల్లి, వసురాంతండా, వెంకటాపూర్, పోతంశెట్పల్లి, అప్పాజిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతున్నదని బీఆర్ఎస్ అభ్యర్థి సునీతారెడ్డి అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా మండలంలో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశాం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసుకున్నాం. డంపింగ్యార్డులు నిర్మించుకున్నాం. వైకుంఠధామాలు కట్టుకున్నాం. 24 గంటలు ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబీమా వంటి పథకాలు అమలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలన్నారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. కేసీఆర్ మూడోసారి సీఎంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. నర్సాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు పక్కా అని.. మెజార్టీ ఎంతన్నదే లెక్క తేలాల్సి ఉందన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గౌరిశంకర్ గుప్తా, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, సర్పంచ్లు మంజుల, మన్నె శ్రీను, లంబాడి మోతి, నెల్లి కిష్టయ్య, నాగరాణి, వీరారెడ్డి, గోదావరి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, మండల గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్గౌడ్, ఆత్మ వైస్ చైర్మన్ శేఖర్, బీఆర్ఎస్ యువత అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, ఆత్మ డైరెక్టర్ ఆంజనేయిలు, ఏఎంసీ వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, ఎంపీటీసీలు ఉదయ వేమారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, మైనార్టీ నాయకులు మోహీయొద్దీన్, నాయకులు కాశినాథ్, సోమ నర్సింహులు, సంతోశ్ కుమార్, నాగేశ్వర్రావు, రవితేజరెడ్డి, శ్రీనివాస్గౌడ్, విజయభాస్కర్రెడ్డి, చిన్న రాయన్న, నాయిని వెంకటనర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి, నవంబర్ 2 : రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని, బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. గురువారం వెల్దుర్తికి విచ్చేసిన ఎమ్మెల్యే జడ్పీటీసీ రమేశ్ గౌడ్, మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, ఎంపీటీసీ మోహన్రెడ్డి, నాయకులతో కలిసి సమావేశమయ్యారు. మండలంలో చేపట్టాల్సిన ప్రచారం, పలువురు బాధ్యులను ఏర్పాటు చేసి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంపై నాయకులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధ్యమవుతాయని ప్రజలు విశ్వాసంగా ఉన్నారన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి భారీ మెజార్టీ ఖాయమని, నియోజకవర్గ నాయకులు పూర్తి సమన్వయంతో పని చేస్తున్నారన్నారు.
వెల్దుర్తి పట్టణానికి చెందిన పార్టీ కార్యకర్త, మాజీ వార్డు సభ్యుడు ఈసారం వెంకటేశం తల్లి సుగుణ అనారోగ్యంతో మంగళవారం మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గురువారం వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. వెంకటేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎమ్మెల్యే వెంట నా యకులు కృష్ణాగౌడ్, శేఖాగౌడ్, రమేశ్గుప్తా, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశం, శాఖారంశ్రీను, గంగాధర్,శ్రవణ్లతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.