మెదక్, జూలై 23 (నమస్తే తెలంగాణ): దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల ఆసరా పింఛన్ను రూ.3,016ల నుంచి రూ.4,016 కు పెంచుతూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. పింఛన్ను ఈనెల నుంచే అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేరొన్నది. దీంతో మెదక్ జిల్లాలో 8604 మందికి లబ్ధి చేకూరనున్నది.
మెదక్ జిల్లాలో 8604 మంది దివ్యాంగులకు ఇప్పటికే రూ.3016 పింఛన్తో ప్రతి నెలా రూ.2 కోట్ల 68 లక్షల 24 వేల 304 చెల్లిస్తున్నారు. ఇప్పుడు రూ.వెయ్యి పెరగడంతో రూ.3 కోట్ల 45 లక్షల 53వేల 664 చెల్లించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.3,016కు ప్రభుత్వం పెంచింది. ఇప్పుడు మరోసారి వెయ్యి రూపాయిలు పెంచింది. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలు, విధానాలతో దివ్యాంగులకు చేరువవుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రూ.3,016 ఉన్న పింఛన్ను మరో వెయ్యి రూపాయలతో రూ.4,016కు పెంచడంతో దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని చెబుతున్నారు. సిద్దిపేట పట్టణంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలిపారు.
కొల్చారం, జూలై 23: తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాలతో పాటు దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతకాలని పింఛన్ పెంచుతున్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా నేనున్నానంటూ ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. నెల వారి పింఛన్ రూ.4,016లకు పెంచడం హర్షణీయం. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనివిధంగా పింఛన్ పెంచిన సీఎం కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడు. మూడోసారి సీఎంగా కేసీఆర్ అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని అందరం ఆకాంక్షిస్తున్నాం.
– గిరిగల్ల వెంకటేశ్గౌడ్, అధ్యక్షుడు, కొల్చారం మండల దివ్యాంగుల సంక్షేమ సంఘం