రామచంద్రాపురం, మార్చి 23 : ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి నేతృత్వంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వచ్చే నెల ఏప్రిల్ 9వ తేదీన తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆత్మీయ సమ్మేళనాన్ని మున్సిపాలిటీలోని ప్రతి వార్డు నుంచి ప్రజలు భారీగా తరలివచ్చే విధంగా కౌన్సిలర్లు, స్థానిక నాయకులు సన్నాహాలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు రవీందర్రెడ్డి, బాబ్జీ శ్రీశైలం, లచ్చిరాం, నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ మల్లారెడ్డి, నాయకులు సోమిరెడ్డి, నర్సింహ, వెంకట్రాంరెడ్డి, ఉమేశ్, రవీందర్రెడ్డి, రమేశ్, శ్రీకాంత్రెడ్డి, ఇంద్రారెడ్డి, సాగర్, చెన్నారెడ్డి, బాల య్య, యాదగిరి, దయాకర్, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.