రామచంద్రాపురం, ఏప్రిల్ 16 : సమాజంలో కులం, మతం, వర్ణం, లింగ విభేదాలు లేవని, అందరూ ఒకటేనని 12వ శతాబ్దంలోనే విశ్వవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయుడు విశ్వగురు మహాత్మా బసవేశ్వరుడని, ఆయన స్ఫూర్తితో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని బీరంగూడ కమాన్లో ఎమ్మెల్యే సొంత నిధులు రూ.30లక్షలతో ఏర్పాటు చేసిన బసవేశ్వరుడి 12అడుగుల అశ్వారుడ కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ 12వ శతాబ్దంలోనే కులరహిత సమాజం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడని కొనియాడారు. సమసమాజ స్థాపన కోసం దేవుడిని భక్తుడి వద్దకు తీసుకువచ్చే ఇష్టలింగ పూజా కార్యక్రమాన్ని ఆయన తీసుకువచ్చారని తెలిపారు. బసవేశ్వరుడి బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించడంతోపాటు ట్యాంక్పై విగ్రహాన్ని ఏర్పాటు చేశాడన్నారు.
కోకాపేటలో వీరశైవలింగాయత్ల కోసం ఎకరా స్థలం కేటాయించి భవనాన్ని నిర్మిస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వీరశైవలింగాయత్ల విజ్ఞప్తి మేరకు రూ.30లక్షలు సొంత నిధులతో బసవేశ్వరుడి కాంస్య విగ్రహాన్ని బీరంగూడకమాన్లో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య లింగ విభేదాలు తొలిగించడానికి కృషి చేసిన గొప్ప అభ్యుదయవాది అన్నారు. సర్వ మానవ సమానత్వమే శాంతికి మూలమని ఉపదేశించారన్నారు. బీరంగూడ గుట్టపైన వెయ్యి గజాల స్థలాన్ని వీరశైవలింగాయత్కు కేటాయించి భవన నిర్మాణానికి సహకారం అందించబోతున్నట్లు తెలిపారు. వీరశైవలింగాయత్లు సీఎం కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన కోరారు. అనంతరం ప్రొటెం మాజీ చైర్మన్ భూపాల్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీసీ కమిషన్ సభ్యులు శుభప్రదపటేల్, పీఠాధిపతులు ప్రసంగించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్పానగేశ్, మొట్టుకుమార్, జడ్పీ వైస్చైర్మన్ ప్రభాకర్, ఏఎంసీ చైర్మన్ విజయ్, ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్రెడ్డి, అమీన్పూర్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, బీరంగూడ వీరశైవలింగాయత్ అధ్యక్షుడు బస్వరాజ్, ప్రధానకార్యదర్శి సంతోష్, నాయకులు ఆదర్శ్రెడ్డి, జైపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, కుమార్గౌడ్, మోహన్గౌడ్, క్రాంతి, లింగాయత్ సంఘం పెద్దలు పాల్గొన్నారు.