మీ ఆడబిడ్డగా ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ఇంటింటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని చిట్కుల్, బద్రియ తండా, గుజిరి తండా, గౌతాపూర్, టోప్యితండా, గన్య తండా, చండూర్, చిలిపిచెడ్, శీలాంపల్లి, సోమక్కపేట, రాందాస్గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
చిలిపిచెడ్, నవంబర్ 7: బీఆర్ఎస్ అధికారంలో వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న ఇంటింటికీ కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో ఉన్న చాముండేశ్వరీ ఆలయంలో అమ్మవారికి వారు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండలంలోని చిట్కుల్, బద్రియ తండా, గుజిరి తండా, గౌతాపూర్, టోప్యితండా, గన్య తండా, చండూర్, చిలిపిచెడ్, శీలాంపల్లి, సోమక్కపేట, రాందాస్గూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చిట్కుల్, బంద్రియ తండా, గౌతాపూర్ తదితర గ్రామాల్లో వారికి ప్రజలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండ్ బాజా, డప్పుచప్పుళ్లతో ఆటపాటలతో, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నినాదాలు, ర్యాలీల మధ్య ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వాదిస్తే ఎమ్మెల్యే అన్న మదన్రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోనికి రాగానే అసైన్డ్ భూములపై రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తామన్నారు. గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. అధికారంలోకి రాగానే మహిళలకు సౌభాగ్యలక్ష్మి అందిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటకలా కరెంట్ గోస పడాల్సిందేనని, ప్రజలారా మీ ఓటు రైతుబంధుకు వేస్తారో లేదా రాబంధులకు వేస్తారో ఆలోచించండని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండలంలో ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని కోరారు. మంజీరా నదిలో 14 చెక్డ్యాంలు నిర్మించిన ఘనత కేసీఆర్కు దక్కిందన్నారు. చిలిపిచెడ్ మం డలం మంజీరా నదిలో అజ్జమర్రి, ఫైజాబాద్, చండూర్, చిట్కుల్ గ్రామ శివారులో చెక్డ్యాంలు నిర్మించామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభర స్వామి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ధ ర్మారెడ్డి, వైస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సుభాష్రెడ్డి, మహిళా మండల అధ్యక్షురాలు మీన్నా ప్రసన్నరెడ్డి, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, జిల్లా రైతు బంధు సమితి సభ్యుడు సయ్యద్ హుస్సేన్, మండల కో ఆప్షన్ సభ్యుడు షఫీయొద్దీన్, నాయకులు మాణిక్యారెడ్డి, మధుసుదన్రెడ్డి, రాజేందర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, శ్రీనివాస్గుప్తా, సర్పంచులు గోపాల్రెడ్డి, బుజ్జిబాయి, రాకేశ్నాయక్ స్వరూ పా విఠల్, స్వాతి జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.