మునిపల్లి, నవంబర్ 22: దేశ ప్రధాని మోదీ మహా కిలాడీ అని, తెలంగాణలో బీజేపీకి చోటు లేదని అం దోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. మం గళవారం మండలంలోని పోల్కంపల్లి గ్రామ శివారులో గల శ్రీసాయి గార్డెన్ల్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి చెంప చెల్లుమనేలా బుద్ధి చెప్పినా సిగ్గురాలేదన్నారు.
టీఆర్ఎస్ మంత్రుల ఇండ్లల్లో ఈడీతో సోదాలు చేయించడం సిగ్గుచేటన్నారు. ఈడీ సోదాలు తెలంగాణలో సత్ఫలితాలు ఇవ్వవన్నారు. రాష్ట్రంలో అవినితీకి తావు లేకుండా సీఎం కేసీఆర్ పాలించడం ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తున్నదని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా ఫలితం ఉండదన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే నంబ ర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, కొండంత అండగా నిలుస్తున్న సంగతి తెలుసుకోవాలన్నారు.
ఆయన బావమరుదులు బాగుపడ్డారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందోల్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదని ఎమ్మెల్యే అన్నారు. దామోదర రాజనర్సింహ ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన బావమరుదులు, తమ్ముడు తప్ప ఇంకెవ్వరూ బాగు పడలేదన్నారు. అందోల్ అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత దామోదరకు లేదన్నారు.
మళ్లీ టీఆర్ఎస్దే విజయం
అంతారంలో నాలుగు రోజుల నుంచి కొనసాగుతున్న పాండురంగ మహరాజ్ ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అంతారం జీవన్ముక్త పాండురంగ మహరాజ్ ఆలయ సంస్థాపన పీఠధిపాతి బాలరాజ్ మహరాజ్ ఎమ్మెల్యేకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో నాయకుడు సాయికుమార్, పార్టీ మం డల అధ్యక్షుడు సతీశ్, ప్రధాన కార్యదర్శి శశికుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బాబాపటేల్, రాయికోడ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీనివాస్, మల్లేశం, గారీబోద్దిన్, చెన్నవీరయ్యస్వామి, సర్పంచ్లు విజయ్భాస్కర్, రమేశ్, శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాంచందర్రావు, చంద్రయ్య, నాయకులు విఠల్, నాగేశ్, రామకృష్ణ, మల్లేశం, గోరెమియా, నారాయణ, చంద్ర య్య, ధన్రాజ్, సుభాశ్ తదితరులు పాల్గొన్నారు.