పెద్దశంకరంపేట, జనవరి 26 : మండలకేంద్రం పెద్దశంకరంపేటలోని పురాతనమైన చారిత్రాత్మక శ్రీరామాలయం అభివృద్ధికి కృషి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం పెద్దశంకరంపేట లోని రామాలయం పునర్మిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎమ్మెల్యేకు వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభం, మేళ వాయిద్యాల తో స్వాగతం పలికారు. తొగుట పీఠాదిపతి మాధవానంద సరస్వతీ స్వామి సూచనలతో రామాలయ పునర్మిర్మాణ కార్యక్రమం చేపట్టారు. భూమిపూజ చేసిన అనంతరం రా మాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామాలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తానన్నారు. ఆలయ కమిటీ 30 శాతం నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తే.. మిగిలిన 70 శాతం నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తామని హమీ ఇచ్చారు. ఆలయ నిర్మాణానికి ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, కమిటీ సభ్యులు ముం దుకు రావడాన్ని ఎమ్మెల్యే అభినందించారు. గ్రామస్తులం దరూ భవ్యమైన రామాలయం నిర్మాణానికి ముందుకు రా వాలని పిలుపునిచ్చారు. ప్రాచీన ఆలయాన్ని తొలిగించి నూతన నిర్మాణం చేపట్టడం అభినందనీయమన్నారు.
వసంత పంచమి వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే
వసంతపంచమి పురస్కరించుకొని పెద్దశంకరంపేటలోని శ్రీసరస్వతీ శిశుమందిరంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి హాజరై చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. సంస్కృతి, సంప్రదాయాలను శిశుమందిరాలు కాపాడుతున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సుకన్య సమృద్ధి యోజనలో చేరాలి
సుకన్య సమృద్ధి యోజన పథకం ఆడపిల్లలకు వరమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. పెద్దశంకరంపేటలో సుకన్యయోజన పథకంలో 80 మంది ఖాతాదా రులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఆడపిల్లల కోసం 15 ఏండ్లపాటు పోస్టాపీస్లో నగదు జమ చేస్తే, అమ్మాయికి 21 ఏండ్లు నిండిన తర్వాత కట్టిన నగదుకు మూడింతల ఆదాయం లభిస్తుందన్నారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు ఇప్పటివరకు రూ.50 వేలు ఖర్చు చేసి, ఖాతాదారులను చేర్పించడం అvRనందనీయమన్నారు.
ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు కనకరాజు, కేంద్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ విగ్రాం శ్రీనివాస్గౌడ్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు, వైస్ ఎంపీపీ లక్ష్మీరమేశ్, నాయకులు వేణుగోపాల్గౌడ్, సుభాశ్గౌడ్, దాదిగారి గంగాధర్, సిద్దు, ఆర్ఎన్ సంతోశ్, అనిల్, సర్వేశ్వర్, అన్నారం మురళి, లక్ష్మణ్, రమేశ్, కందుకూరి రవి, పోస్టాపీస్ సిబ్బంది మాణెయ్య, రవివర్మ ఉన్నారు.