సంగారెడ్డి, మే6 : బ్రెయిన్ స్ట్రోక్తో నిమ్స్లో చికిత్స పొందుతున్న భాస్కర్కు ముందస్తు వైద్య చికిత్సల నిమిత్తం చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఎల్వోసీని అందజేశారు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీనగర్కు చెందిన బాధితుడు భాస్కర్కి రూ.1.50లక్షల ఎల్వోసీని ఇచ్చారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్, ఎల్వోసీలు నిరుపేదల పాలిట వరంలాంటివని, ఆర్థిక స్థోమతలేని పేదవారికి ఎంతో ఉపయోగడతాయన్నారు.
బ్రెయిన్ స్ట్రోక్తో చికిత్స పొందుతున్న బాధితుడికి త్వరగా నయం కావాలని భగవంతుడిని వేడుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు దుర్గాప్రసాద్, మనోహర్గౌడ్, మోహన్రెడ్డి, శంకర్గౌడ్, మల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.