భగలాముఖీశక్తి పీఠం నెలకొల్పడం తెలంగాణ ప్రజల అదృష్టం
మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
ధ్యాన మందిర శిలాన్యాస భూమిపూజ
శివ్వంపేట, జూన్ 24: మండల కేంద్రమైన శివ్వంపేట త్వరలో వేదభూమిగా మారనున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. శివ్వంపేటలో భగలాముఖి శక్తిపీఠం ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఆలయ ఉపాసకులు శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ ఆధ్వర్యంలో నిర్మించే ధ్యాన మందిరం, బ్రా హ్మణ నివాస శిలాన్యాస కార్యక్రమాలకు వారు జడ్పీటీసీ పబ్బమహేశ్గుప్తా, ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శివకుమార్గౌడ్తో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రపంచస్థాయిలో ఎవరూ చేయలేని విధంగా అయుతచండీ యాగాన్ని ఐదు రోజులపాటు చేయడంతో రాష్ట్రంలో ధార్మిక కార్యక్రమాలు పెరిగాయన్నారు. శాస్ర్తుల వెంకటేశ్వరశర్మ బగలాముఖీ శక్తిపీఠం నెలకొల్పాలనుకోవడం అందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరిస్తుండడం అభినందనీయమన్నారు.
అమ్మవా రి కృపతో నర్సాపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. కాగా, ప్ర ముఖ వ్యాపారవేత్త బేకు రాజుకుమార్ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా ఎమ్మెల్యే చేతులమీదుగా ట్ర స్టు చైర్మన్కు అందజేశారు. ఈ నెల 27న సాయంత్రం 5గంటల ప్రాంతంలో కంచికామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్రసరస్వతీస్వామి రానున్నారని, భక్తులు పెద్దఎత్తున హాజరుకావాలన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమంలో వారు పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, కౌన్సిలర్ అశోక్గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, సీనియర్ నాయకులు పబ్బ రమేశ్గుప్తా, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు లావణ్యామాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, సర్పంచ్ పత్రాల శ్రీనివాస్గౌడ్, కోఆప్షన్ సభ్యులు లాయక్, వేద పండితులు వామనశర్మ, ఉపసర్పంచ్ పద్మావెంకటేశ్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజలు పాల్గొన్నారు.