సంగారెడ్డి కలెక్టరేట్, ఫిబ్రవరి 27: పేద విద్యార్థులకు తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో మెరుగైన విద్యను అందిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి తెలిపారు. సోమవారం తారా ప్రభుత్వ కళాశాల ఐక్యూఏసీ ఆధ్వర్యంలో స్టూడెంట్ సక్సెస్ మీట్, అలూమినీ, అధ్యాపక తల్లిదండ్రుల సమావేశాలను ప్రిన్సిపాల్ ప్రవీణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నరహరిరెడ్డి మాట్లాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన విద్యను అందిస్తున్న తారా కళాశాల తెలంగాణలోనే ప్రత్యేకమన్నారు. 2018 నుంచి ఇప్పటివరకు తారా కళాశాల నుంచి జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని, కళాశాలకు గుర్తింపు తెచ్చిన విద్యార్థులను అభినందించారు. సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి ఉన్నత స్థానాలకు ఎదిగిన విద్యార్థులను సన్మానించడం అభినందనీయమన్నారు. పూర్వ విద్యార్థులు కళాశాల అభివృద్ధికి చేయూతనందించాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటేశం, ఐక్యూఏసీ కన్వీనర్ ఏవీ శర్మ, పూర్వ విద్యార్థులు ఉత్తర్పల్లి మాణయ్య, మహమ్మద్ సర్దార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ జగదీశ్వర్, డాక్టర్ పద్మజ, డాక్టర్ అభిజిత్, డాక్టర్ సిద్దులు, శివదీప్తి, డాక్టర్ విజయ, ఎన్సీసీ అధికారి మనోజ్ కుమార్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.