బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. కోట్లతో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారమవుతున్నది. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హోతి(కే) శివారులో నిర్మించిన 666 ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి నిర్మాణానికి సర్కారు రూ. 34.98 కోట్లు ఖర్చు చేయగా, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ. 25 కోట్లు వెచ్చించింది. నేడు జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్న ఆర్థిక,వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేయనున్నారు. మూడువేల మందికి గృహలక్ష్మి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తారు. పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అనంతరం మున్సిపాలిటీలో రూ.30 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు.
– జహీరాబాద్, అక్టోబర్ 6
జహీరాబాద్ మున్సిపల్, మండలం, మొగుడంపల్లి, కోహీర్, ఝరాసంగం,
న్యాల్కల్ మండలాల్లో మూడు వేల మందికి మంత్రి హరీశ్రావు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేయనున్నారు. ఇందుకోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేసి అర్హుల జాబితాను ఆన్లైన్లో నమోదు చేశారు. మున్సిపాలిటీలో రూ. 30 కోట్ల పనులకు శంకుస్థాపనలుజహీరాబాద్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ రూ. 30 కోట్లు మంజూరు చేశారు. ఈ పనులన్నింటికీ నేడు మంత్రి హరీశ్రావుశంకుస్థాపనలు చేయనున్నారు. 37 వార్డులో సీసీ రోడ్లు, మురికి కాల్వలు, బీటీరోడ్లు నిర్మించాలని మున్సిపల్, ఇంజినీరింగ్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. టెండర్లు వేసి పనులు ప్రారంభించేందుకు ఇంజినీరింగ్ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యేమాణిక్రావు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
జహీరాబాద్, అక్టోబర్ 6: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ రూ. కోట్లు ఖర్చు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి(కే) శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం 666 ఇండ్లు నిర్మించింది. రూ. 5.30 లక్షలతో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మించగా, 666 ఇండ్ల కోసం సర్కారు రూ. 34.98 కోట్లు ఖర్చు చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ. 25 కోట్లు మంజూరు చేసింది. మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులను గుర్తించేందుకు గతంలోనే సర్వే నిర్వహించిన అధికారులు డ్రా ద్వారా అర్హులను ఎంపిక చేశారు. నేడు జహీరాబాద్ పట్టణంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై గృహప్రవేశాలు చేయించనున్నారు.
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతి(కే) శివారులో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 34.98 కోట్లతో 666 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించింది. మిషన్ భగరీథ, కరెంట్, సీసీ రోడ్లు, మురికి కాల్వలు, పార్కు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడంతో పాటు రోడ్ల పక్కన చెట్ల పెంపకం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలోని 37 వార్డులకు చెందిన నిరుపేదలతో పాటు మున్సిపాలిటీలో విలీనమైన అల్లీపూర్, పస్తాపూర్, రంజోల్, చిన్న హైదరాబాద్, హోతి(కే) గ్రామాల్లో నివాసం ఉంటున్న పేదలకు ఇండ్లు పంపిణీ చేయనున్నారు. రెవెన్యూ అధికారులు వార్డుల వారీగా సర్వే చేసి లబ్ధిదారులను గుర్తించి డ్రా ద్వారా ఎంపిక చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, కరెంట్ సౌకర్యం ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ప్రత్యేక పైపులైన్ వేసి మంజీరా నీటిని సరఫరా చేయనున్నారు. బ్లాక్ల వారీగా ట్రాన్స్ఫార్మర్లు బిగించడంతో పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలోకి గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటన సందర్భంగా ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఎమ్మెల్యే మాణిక్రావు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్లు చర్యలు తీసుకున్నారు. పబ్లిక్ హెల్త్ ఈఈ ప్రతాప్కుమార్, సంగారెడ్డి జిల్లా గృహనిర్మాణ శాఖ అధికారి శ్రీనివాస్ప్రసాద్, కాంట్రాక్టర్ రమణారెడ్డిలు దగ్గరుండి పనులు చేయించారు.
జహీరాబాద్, అక్టోబర్ 6: రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు, బీఆర్ఎస్ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. 20 వేల మంది జనసమీకరణ చేసేందుకు బీఆర్ఎస్ నాయకులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఏర్పుల నరోత్తమ్, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జహీరాబాద్ పట్టణంలోని ప్రధాన రోడ్డు వెంట పార్టీ బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేయడంతో అంతా గులాబీమయంగా మారింది. ప్రధాన చౌరస్తాలు, బహిరంగ సభా వేదిక వద్ద జెండాలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
హోతి(కే) శివారులో నిర్మించిన 666 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 7న పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. సీసీ రోడ్లు, మురికి కాల్వలు, కరెంట్ సౌకర్యం, మిషన్ భగరీథ పనులు చివరిదశకు చేరుకున్నాయి. లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించి, సమావేశం నిర్వహిస్తాం. మంత్రి హరీశ్రావు పర్యటనలో ఎలాంటి సమస్యల్లేకుండా అధికారులు, కాంట్రాక్టరు పర్యవేక్షణ చేస్తున్నారు.
– ప్రతాప్కుమార్,
జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో శనివారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సభకు ముఖ్యఅతిథిగా హాజరు అవుతుండడంతో బీఆర్ఎస్ నాయకులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వేల మంది గృహలక్ష్మి లబ్ధిదారులతో పాటు వారి కుటుంబసభ్యులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు సభకు రానున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి జన సమీకరణ చేసేందుకు అధికారులు, బీఆర్ఎస్ నాయకులు ప్రణాళికలు రూపొందించారు. వర్షం పడినా వేదికకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. మహిళా సంఘాలకు రుణాల మంజూరు పత్రాలు అందించనున్నారు.
ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటనకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. హోతి(కే) శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసి గృహప్రవేశాలు చేయిస్తాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో నిర్వహించే బహిరంగ సభకు ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన లబ్ధిదారులు హాజరవుతారు. నియోజకవర్గంలో 3వేల మందికి మంత్రి హరీశ్రావు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందజేస్తారు.
– కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్