రామాయంపేట, జనవరి 16 : రేపటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు వంద రోజుల పాటు కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని డీ.ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ హరిప్రియ తెలిపారు. సోమవారం రా మాయంపేట, నిజాంపేట మండలాల్లో సబ్సెంటర్లను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం రామాయంపేటలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ నుంచి కంటివెలుగు కార్యక్రమాన్ని రామాయంపేటలో ఒకటో వా ర్డు, నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ప్రా రంభిస్తున్నట్లు తెలిపారు. 18సంవత్సరా పైబడ్డ 73వేల మం దిని రెండు మండలాల వ్యాప్తంగా గుర్తించామని వారందరికీ వందరోజుల పాటు కంటివెలుగు శిబిరంలో పరీక్షలు చేస్తామన్నారు.
రామాయంపేట పట్టణ, మండల వ్యాప్తంగా 27శిబిరాలు, నిజాంపేట మండల వ్యా ప్తంగా 14 శిబిరాలు మొత్తం 41కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారి హరిప్రియ తెలిపారు. ఒక్కో బృందంలో ఎనిమిది మంది వైద్య సిబ్బంది ఉంటారని ఒక్కరోజు 250 మం దికి కంటివెలుగులో వైద్యం నిర్వహిస్తామని తెలిపారు. వంద రోజుల పాటు కంటివెలుగును నడిపిస్తామని తెలిపారు. కంటి వెలుగులో కండ్లకు సంబంధించిన వారికి అద్దాలు కూడా ఉచితంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని రెండు మండలాల ప్రజలు సద్వినియోగం చేసు కొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్ఎన్ఎం సత్తమ్మ, వెంకటేశ్వర్రావు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు రాణి, లక్ష్మి, రాధిక, గోరి, పుష్ప ఉన్నారు.
కంటి వెలుగును విజయవంతం చేయాలి
చిన్నశంకరంపేట, జనవరి16: రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్ నీరజ సూ చించారు. సోమవారం మండలంలోని సూరారంలో కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అనురాధ, ఉప సర్పంచ్ గోవర్ధన్రెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, బీఆర్ఎస్ నాయకుడు పవన్గౌడ్, వార్డు సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశవర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.