రామాయంపేట, నవంబర్ 28: పురపాలిక వార్డుల్లో సమస్యల్లేకుండా తీర్చడమే బస్తీబాట ఉద్దేశమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ యాదగిరి, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి అన్నారు. సోమవారం రా మాయంపేట పురపాలికలో వార్డులో వారం రోజుల పర్యటనలో భాగంగా 9వ వార్డుల్లోని సమస్యలను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తేవాలని వార్డు ప్రజలను, వార్డు కౌన్సిలర్ దేవుని జయరాజును కోరారు.
ముఖ్యం గా వార్డులో ఏ సమస్య ఉన్నా తనకు చెప్పలన్నారు. వార్డులో మురుగు కాల్వలు, రోడ్లు నిర్మించాలని చైర్మన్ దృష్టికి తెచ్చారు. వెంటనే అక్కడికే సం బంధిత ఏఈని పిలిపించుకుని ఈ సమస్యను ఏఈకి తెలిపారు. ఒక్కో వార్డుకు ఒక్క వారం సమయం తీసుకుంటామని పట్టణంలోని 12వార్డులకు మూడు వార్డు లు నేటితో పూర్తి అయ్యాయని తెలిపారు. ఇంకా 9వా రాల పాటు ప్రతి గల్లీ తిరిగి వార్డు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.
సీఎం కేసీఆర్ మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రం గాల్లో సుందరీకరిస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందితో పాటు కౌన్సిలర్లు దేమె యాదగిరి నాయకులు పుట్టి యాదగిరి, చంద్రపు కొండల్రెడ్డి, నాయకులు చంద్రపుశోభ, చిలుక గంగాధర్ఐలయ్య, చం ద్రపు కొండల్రెడ్డి, నాగేశ్వర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు.