హుస్నాబాద్, ఫిబ్రవరి 27: ఐదేండ్లు కరీంనగర్ ఎంపీగా ఉండి బండి సంజయ్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఎన్నికల్లో గెలవాలని ఇప్పుడు రాముడి పేరుతో రాజకీయాలు చేస్తున్నాడని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తన నివాసంలో విలేకరులతో మంత్రి మాట్లాడారు. రాజకీయంగా బండి సంజయ్ను తాను ప్రశ్నిస్తే, అతడు తనకు జన్మనిచ్చిన తల్లిని కించపరుస్తూ మాట్లాడడం బాధాకరమన్నారు.
శ్రీరాముడు అంటే అందరికీ గౌరవం ఉందని, రాముడి గురించి మాట్లాడే బీజేపీ నాయకులు తల్లి గురించి, జన్మల గురించి మాట్లాడటమేమిటని ప్రశ్నించారు. నాలుక, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని, లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని బండి సంజయ్కు మంత్రి పొన్నం హెచ్చరించారు.