చిలిపిచెడ్/ నర్సాపూర్, జనవరి 11 : సమాజంలో మహిళలు, పురుషులు ఇద్దరు సమానమే.. మహిళలపై వివక్ష చూ పొద్దని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం చిలిపిచెడ్లోని ఉన్నత పాఠశాలలో ఐసీడీఎస్ అదేశాల మేరకు ఏఆర్ఈఎస్ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో మహిళపై వివక్ష, బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి ముఖ్యఅథితులుగా హాజరై మాట్లాడారు. మహిళల హక్కులను కాపాడాలని సూచించారు. 18 ఏండ్లు నిండిన తర్వాత ఆడపిల్లలకు, 21 ఏండ్లు నిండిన తర్వాతనే పురుషులకు వివాహాలు చేయాలన్నారు. బాల్యవివాహాలను నిర్మూలించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలన్నారు. ఆడపిల్లలను చిన్నచూపు చూడకుండా చదివించాలని సూచించారు.
చిలిపిచెడ్ మండలంలోని తండాల్లో ఎక్కువగా బాల్యవివాహాలు, చిన్న పిల్లల విక్రయాలు జరుగుతున్నట్లు చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాల్యవివాహా లు, చిన్న పిల్లల విక్రయాలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపు నిచ్చారు. అనంతరం చిలిపిచెడ్లో మహిళా చట్టాలు, బాల్యవివాహాలపై విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. ముందుగా కేజీవీబీ పాఠశాలను సందర్శించి, విద్యార్థినులతో కలిసి భో జనం చేశారు. అనంతరం విద్యార్థులకు లింగ వివక్ష రహిత సమాజం, మహిళా చట్టాలు, బాల్యవివాహాలు, రక్తహీనత, పోషకాహారం, షీ టీమ్ సేవలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, డీఈవో రమేశ్కుమార్, జిల్లా సంక్షేమ అధికారి బ్రహ్మజీ, సీడీపీవో హేమభార్గవి, ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, రైతుబంధు సమితి మండలా ధ్యక్షుడు రాజిరెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు లక్ష్మీదుర్గారెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు సుభాష్రెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సంతోషిమాత, సొసైటీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, సఖి కేంద్రం సిబ్బంది, సర్పంచ్లు గోపాల్రెడ్డి, అశోక్గౌడ్, యాదగిరి, నాయకులు నరేందర్రెడ్డి, కిషన్రెడ్డి, లక్ష్మణ్, ముకుందరెడ్డి, సంగాగౌడ్, విఠల్ పాల్గొన్నారు.
అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ పనులను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో నిర్మిస్తున్న అయ్య ప్ప దేవాలయ స్లాబ్ పనులను రాష్ట్ర మహి ళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి మాట్లాడుతూ కలగా మిగిలిన అయ్యప్ప ఆలయ నిర్మాణం నా హయాంలో జరగడం సంతోషంగా ఉందన్నారు. సొంత నిధులతో స్లాబ్ నిర్మాణాన్ని చేపట్టానని, మిగతా పనులు పూర్తయ్యే వరకు బాధ్యత స్వీకరిస్తానన్నారు. శబరిమల ఆలయం మా దిరిగా ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
నర్సాపూర్లో అయ్యప్ప ఆలయ నిర్మాణం మహోన్నత కార్యక్రమని మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అశోక్గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్గుప్తా, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, మున్సిపల్ వైస్చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, నాయ కుడు సుధీర్రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు రావూఫ్, సాగర్, బీఆర్ఎస్ నాయకులు నగేశ్, ఆంజనేయులుగౌడ్, రాకేశ్గౌడ్, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
నర్సాపూర్లో నిర్మిస్తున్న అయ్యప్ప ఆలయ నిర్మాణానికి దాతలు విరాళాలను అందజేశారు. గండి మైసమ్మకు చెందిన లింగంగౌడ్ రూ.51 వేలు, లింగాపూర్ గ్రామానికి చెందిన మహేశ్గౌడ్ రూ.51 వేలు విరాళంగా అందజేశారు.