మెదక్ అర్బన్/ అల్లాదుర్గం/ పాపన్నపేట/ కొల్చారం/ రామాయంపేట/ నిజాంపేట/ తూప్రాన్, అక్టోబర్ 20 : ప్రజారక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని మెదక్ పట్టణ సీఐ పేర్కొ న్నారు. గురువారం పోలీసు అమర వీరుల సంస్మరణలో ప్లాగ్ డే పురస్కరించుకొని ఎస్పీ రోహిణిప్రియదర్శిని ఆదేశాలతో విద్యార్థులకు ఆయుధాలపై ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సం దర్భంగా సీఐ మధు మాట్లాడుతూ…విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజల రక్షణ కోస మే పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం పోలీస్స్టేషన్ పరిసరాలు, స్టేషన్ అధికారి, రైటర్, వైర్ లెస్, కేసుల నమోదు, ట్రాఫిక్ నియంత్రణ, షీ టీమ్ బృందాల సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై మల్లారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
శాంతి భద్రతలో పోలీసుల పాత్ర కీలకం
శాంతిభద్రతల పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకమని అల్లాదుర్గం సీఐ జార్జి అన్నారు. అల్లాదుర్గం పోలీస్టేషన్లో విద్యార్థులకు ఓపెన్హౌజ్ నిర్వహించారు. విధి నిర్వహణలో ఎందరో పోలీసులు అమరులయ్యారని, వారి త్యాగాలు మరువలేనివని సీఐ జార్జి అన్నారు. పోలీసుల విధులతోపాటు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్సై దేవీదాస్, ఉపాధ్యాయుడు అశోక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
ఆయుధాల వినియోగంపై విద్యార్థులకు అవగాహన
పాపన్నపేట పోలీస్స్టేషన్లో పాపన్నపేట ఉన్నత పాఠశాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్కుమార్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయుధాల విని యోగాన్ని వివరించారు. కార్యక్రమంలో ఏఎస్సై గాలయ్య, ఉపాధ్యాయులు చంద్రమోహన్, నరేందర్, వీరేశం, మధు, అశోక్, సుభాశ్, నాగరాజు పాల్గొన్నారు.
కొల్చారం పోలీస్ స్టేషన్లో ఓపెన్హౌస్
కొల్చారం పొలీస్స్టేషన్లో ఓపెన్హౌస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఎస్సై, కొల్చారం ఇన్చార్జి విజయ్నాయక్ కొల్చారంలోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల విద్యార్థినులకు పొలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకునే చర్యలు వివరించారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నేరుగా పొలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేకుం టే 100 నంబర్కు ఫోన్ చేస్తే పోలీసు సిబ్బంది మీ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరిస్తారని వివరించారు. ఎఫ్ఐఆర్ నమోదు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, సీఐ, డీఎస్పీ, అడిషనల్ఎస్పీ, ఎస్పీ, డీజీపీ వరకు పోలీస్ శాఖకు సంబంధించి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న హోదాలకు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్సైలు తారాసింగ్, వాణి, సిబ్బంది మహేశ్, దత్తు, సాయిబాబా, సౌందర్య, యాదమ్మ, దయానంద్ పాల్గొన్నారు.
నేడు గ్రామాల్లో ఉచిత వైద్యశిబిరాలు
రామాయంపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్ తెలిపారు. గ్రామాల్లో సైతం శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలి
నిజాంపేట పోలీస్స్టేషన్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అన్ని దానల కంటే రక్తదానం చాలా గొప్పదని రామాయంపేట సీఐ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. రక్త దానం చేయడమంటే ప్రా ణాన్ని నిలబెట్టడమే అన్నారు. కార్యక్రమంలో నిజాంపేట ఎస్సై శ్రీనివాస్రెడ్డి, నిజాంపేట, నగరం సర్పంచ్లు అనూష, గేమ్సింగ్, నిజాంపేట, నార్లపూర్ ఉప సర్పంచ్లు బాబు, సంజీవ్, వార్డు సభ్యులు మావురం రాజు, ఆముద రాజు, హెల్త్ సూపర్వైజర్ ఉజ్వలరాణి, ఏఎన్ఎంలు, అశ వర్కర్లు, రామాయంపేట కౌన్సిలర్ యాదగిరి, రెడ్క్రాస్ సోసైటీ సభ్యులు ఉన్నారు.
తూప్రాన్లో క్యాండిల్ ర్యాలీ
తూప్రాన్ పట్టణంలో పోలీస్స్టేషన్ నుంచి నర్సాపూర్ చౌరా స్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై సురేశ్కుమార్, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు బాబుల్రెడ్డి, గీతా స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.