రామచంద్రాపురం, ఫిబ్రవరి 22: సంగారెడ్డి జిల్లాలో నాణ్యమైన విద్యకు కేరాఫ్గా గీతాభూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలుస్తుందని జడ్పీచైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆర్సీపురం డివిజన్ మయూరినగర్లో ఉన్న గీతాభూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల 16వ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. వేడుకలకు జడ్పీచైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి, ప్రొటెం మాజీచైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 30మందితో మొదలైన జూనియర్ కళాశాల నేడు 1200మందికి చేరుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. భూపాలన్న జూనియర్ కళాశాలను సొంత ఖర్చుతో కార్పొరేట్ కళాశాలలకు దీటుగా అభివృద్ధి చేసి పేద విద్యార్థులకు అండగా నిలువడం ఆదర్శనీయమన్నారు. కళాశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందజేస్తామన్నా రు. అనంతరం భూపాల్రెడ్డి మాట్లాడుతూ చదువుతోనే ప్రతిఒక్కరూ జీవితంలో అభివృద్ధిని సాధిస్తారని, అలాంటిది పేద విద్యార్థులెవరూ చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో ఎన్నో వ్యయప్రాయాసాలకోర్చి కళాశాలను అభివృద్ధి చేశామన్నారు.
అనంతరం బైపీసీలో 981మార్కులు సాధించిన శ్రావ్యలతను ప్రత్యేకంగా అభినందిస్తూ నీట్లో ర్యాంకు సాధిస్తే ఎంబీబీఎస్కి అవసరమయ్యే ఖర్చును భరిస్తానని చెప్పారు. అనంతరం క్రీడల్లో విజ యం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పుష్పానగేశ్, సింధూఆదర్శ్రెడ్డి, మెట్టుకుమార్యాదవ్, ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి, ఎస్సై శశికాంత్రెడ్డి, నాయకులు రాజేశ్వర్రెడ్డి, గూడెం మధుసూదన్రెడ్డి, సోమిరెడ్డి, కుమార్గౌడ్, బాల్రెడ్డి, యాదగిరియాదవ్, దేవేందర్యాదవ్, అంజయ్య, బాబ్జీ, ఐలేశ్, జగన్నాథ్రెడ్డి, పరమేశ్యాదవ్, విజయ్కుమార్, జగన్మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ ఉమామహేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.