కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం జరగనున్నది. దీనికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 7నుంచి సాయంత్రం 5వరకు ఓటింగ్ జరగనున్నది. జిల్లాలో మెదక్, నర్సాపూర్ రెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తం 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో అర్బన్లో 65 పోలింగ్ కేంద్రాలు, రూరల్లో 514 కేంద్రాలు ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సామగ్రితో సిబ్బంది బుధవారం సాయంత్రం కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 4,40,341 మంది ఓటర్లు ఉన్నారు. 428 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నీడలో పోలింగ్ జరగనున్నది.
పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ నియోజకవర్గంలో 13 మంది, నర్సాపూర్ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంపులు నిర్మించారు. పోలింగ్ కేంద్రాలను ఓటర్లు గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల్లో వృద్ధులు, దివ్యాంగులను కేంద్రాలకు తీసుకువచ్చేలా వాహనాలను అందుబాటులో ఉంచారు.
మెదక్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. గురువారం (నేడు) పోలింగ్ జరగనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు కల్పించారు. బుధవారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఈవీఎంలు, ఎన్నికల మెటీరియల్ పంపిణీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మినీ బస్సుల్లో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 4,40,341 మంది ఓటు హకు వినియోగించుకోనున్నారు. మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,593 మంది ఓటర్లు ఉన్నారు.
మెదక్ నియోజకవర్గంలో 2,16,748 మంది ఓటర్లు ఉన్నా రు. ఇందులో పురుషులు 1,03, 654 మంది, మహిళలు 1,13, 089 మంది, ఇతరులు 5 మంది ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 274 మంది పోలింగ్ అధికారులు, 274 మంది ఏపీవోలు, 548 మంది ఓపీవోలు, 28 మంది సెక్టోరియల్ అధికారులు, 28 మంది రూట్ అధికారులను నియమించారు. మహిళా దివ్యాంగుల కోసం 1, మహిళలకు 5, మోడల్ పోలిం గ్ 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
నర్సాపూర్ నియోజకవర్గంలో 2,23,593 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,09,240 మంది, మహిళలు 1,14,346 మంది, ఇతరులు 7 మంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 305 మంది పోలింగ్ అధికారులు, 305 మంది ఏపీవోలు, 610 మంది ఓపీవోలు, 30 మంది సెక్టోరియల్ అధికారులు, 30 మంది రూట్టు అధికారులను నియమించారు. మహిళా దివ్యాంగుల కోసం 1, మహిళలకు 5, మోడల్ పోలిం గ్ కేంద్రాలు 5 ఏర్పాటు చేశారు.
మెదక్ నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థ్ధులు పోటీలో ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇప్పటికే అభ్యర్థులంతా ప్రచారాన్ని హోరెత్తించారు.మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి పోటీచేస్తున్నారు.
మెదక్ జిల్లాలోని రెండు నియోజవకర్గాల్లో మొత్తం 579 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అర్బన్లో 65 పోలింగ్ కేంద్రాలు, రూరల్లో 514 కేంద్రా లు ఉన్నాయి. వీటిల్లో అన్ని మౌలిక వసతులు కల్పించారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం ర్యాంపులు నిర్మించారు. పోలింగ్ కేంద్రాలను ఓటర్లు గుర్తించేలా ఏర్పాట్లు చేశారు. దూర ప్రాంతాల్లోని వృద్ధులు, దివ్యాంగులను కేంద్రాలకు తీసుకువచ్చేలా వాహనాలను అందుబాటులో ఉంచారు.