శివ్వంపేట, ఆగస్టు 30 : ప్రభుత్వం అందజేస్తున్న ఆసరా పింఛన్తో వృద్ధ్దులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితం తువుల్లో ఆత్మైస్థెర్యం పెరిగి, ఆత్మ గౌరవంగా జీవిస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. మంగళవారం శివ్వంపేట మండలం చండి గ్రామంలోని ఫంక్షన్హాల్లో 848 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. తెలంగాణ సాధించుకున్నాక సీఎం కేసీఆర్ హయాంలో సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయన్నారు.
వయోపరితిమిని 57 ఏండ్లకు తగ్గించి రూ.2016 పింఛన్ ఇస్తూ వృ ద్ధ్దులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులను ఆదుకుంటూ సీఎం కేసీఆర్ వారికి పెద్దదిక్కుగా మారారని పేర్కొన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్ వంటి పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని, కేవలం తెలంగాణలో సీఎం కేసీఆర్కే సాధ్యమైందని గుర్తుచేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుచేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రం లో సంక్షేమ పథకాలు అమలవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. అనంతరం నర్సాపూర్ ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్రెడ్డితోపాటు సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు.
కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ చైర్మన్ చంద్రాగౌడ్, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షురాలు లావణ్యామాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, వైస్ ఎంపీపీ రమాకాంత్రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్చారి, ఎంపీడీవో నవీన్కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు బండారి గంగాధర్, సుధీర్రెడ్డి, కొడకంచి శ్రీనివాస్గౌడ్, నర్సింహరెడ్డి పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా..
సీఎం కేసీఆర్ సార్ ఎన్నికల్ల చె ప్పినట్టు 57 ఏండ్లు ఉన్నోళ్లకు పిం ఛన్ ఇస్తా.. అని చెప్పిండు. ఇప్పు డు పింఛన్ ఇచ్చి మాట నిలబెట్టుకుండు. నాకు పింఛన్ వచ్చినందు కు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటా. – బేగరి సాయిలు, గూడురు, శివ్వంపేట
మాలాంటి వారికి కేసీఆరే దేవుడు
ఈ వయస్సులో కేసీఆర్ సారు ఇచ్చే ఆసరా పింఛన్తో బతుకుత. వచ్చే పైసలను దవాఖాన ఖర్చుల కు పెట్టి, మిగిలిన పైసులను దాచుకుంటాను. అప్పట్లో రూ.200 ఉం డే.. ఇప్పుడు కేసీఆర్ సార్ రూ.2 వేలు ఇచ్చి నాలాంటి ముసలోళ్లకు దేవుడిలా ఆదుకుంటున్నాడు.
– కాట్రోత్ చాంది