రూ.50 కోట్ల పనులకు శంకుస్థాపన
12,600 ఎకరాల్లో పరిశ్రమల స్థాపన
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు
సభాస్థలాన్ని పరిశీలించిన సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్
జహీరాబాద్, జూన్ 20: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే.తారకరామారావు జహీరాబాద్ పర్యటనను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కోరారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. బుధవారం మంత్రి కేటీఆర్ పర్యటనలో భాగంగా ఉదయం 10గంటలకు నిమ్జ్లో ఏర్పాటు చేసే రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు శంకుస్థాపన, ఎంజీ పరిశ్రమలో భూమి పూజ చేస్తారని తెలిపారు. అనంతరం బాగారెడ్డి స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జహీరాబాద్ పట్టణానికి తొలిసారి వస్తున్న మంత్రి కేటీఆర్కు 10 వేల మందితో ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. జహీరాబాద్ మున్సిపాలిటీకి కేటాయించిన రూ.50 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. 12,600 ఎకరాల్లో నిర్మించనున్న పరిశ్రమలతో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. బాగారెడ్డి స్టేడియంలో 11గంటలకు నిర్వహించే బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ఆత్మకమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఎం.జీ.రాములు, గుండప్ప, తన్వీర్, బాబీ, పాల్గొన్నారు.
ఝరాసంగం: పరిశ్రమ నిర్మాణం కోసం భూమి పూజ చేయునున్న స్థలాన్ని పరిశీలిస్తున్న జల్లా ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే మాణిక్రావు
సభాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ, ఎమ్మెల్యే
ఝరాసంగం, జూన్20: సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం మండలం చీలపల్లి గ్రామ శివారులో వేమ్ టెక్నాలజీ పరిశ్రమ నిర్మాణ స్థలాన్ని ఎస్పీ రమణకుమార్, ఎమ్మెల్యే మాణిక్రావు సోమవారం పరిశీలించారు. ఈ నెల 22న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో పాటు పలువురు ప్రముఖులు ఇక్కడ భూమి పూజ చేసి, శంకుస్థాపన చేయనున్నారు. సభా స్థలాన్ని ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మల్కాపూర్ శివకుమార్ కూడా పరిశీలించారు. వారి వెంట జహీరాబాద్ డీఎస్పీ రఘు, ఏఆర్డీ ఎస్పీ జనార్దన్, సీఐలు భూపతి, భరత్కుమార్, ఎస్సైలు రాజేందర్రెడ్డి, ఏడుకొండలు, పరమేశ్వర్గౌడ్, కాశీనాథ్, నాయకుడు తన్వీర్, కేతకీ ఆల య కమిటీ మాజీ చైర్మన్ వెంకటేశం, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండప్ప, జహీరాబాద్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు యాకూబ్, నామ రవికిరణ్ ఉన్నారు.