మెదక్ మున్సిపాలిటీ, ఆగస్ట్టు 1 : రాబోయే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధం గా ఉండాలని అధికారులను మెదక్ కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో ఎస్పీ రోహిణి ప్రయదర్శిని, ఆదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో పద్మశ్రీ, పంచాయతీరాజ్, పోలీస్, రెవెన్యూ ఆధికారులతో రాబోయే శాసన సభ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 576 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 10 నుంచి 12 పో లింగ్ కేంద్రాలకు ఒక సెక్టర్ అధికారిని నియమిస్తామన్నారు. పట్టణాల్లో 1500 ఓటరు, గ్రామీణ ప్రాంతాల్లో 1400 ఓట ర్లు కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిప్రాదనలు పంపిస్తామన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ, నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బీఎల్వోలు, బీఎల్ఏలు ఇంటింటీ సర్వేలో ఫారమ్ 6, 7, 8 నమోదును వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో 18 నుంచి 19, 20 నుంచి 29 వయస్సున్న ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఇతర జిల్లాలోని వివిధ కళాశాలల్లో డిగ్రీ, ఎల్ఎల్బీ, ఐటీఐ చదువుతున్నారని తెలిపారు. అక్కడి విద్యార్థుల వివరాలు సేకరిం చి, కళాశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసిన ఓటరు నమోదు చేయించాలని ఆదేశించారు. అన్ని విద్యాసంస్థల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో ఓటరు నమోదు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రాంతాలను గుర్తించాలి : ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వా తావరణంలో జరగడానికి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రాంతాలను ముందుగా గుర్తించాలని ఎస్పీ రోహి ణిప్రియదర్శిని సూచించారు. పోలీసులు, తహసీల్దార్లు సమన్వయం తో పోలింగ్ స్టేషన్లను పరిశీలిస్తూ, స మస్యత్మక ప్రాంతాలను ముందుగా గుర్తించాలన్నారు. డీ ఆర్వో పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లా అధికారులు, పోలీస్, త హసీల్దార్లు, ఎంపీడీవోలు.. ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధు ల సమన్వయంతో పౌరహక్కుల దినోత్సవాన్ని ప్రతినెలా నిర్వహించి ప్రజలను చైతన్యపర్చాలన్నారు. జోగిని, బసవ ని, బాణామతి, బ్యాండెడ్ లేబర్ వంటి వ్యవస్థను నిర్మూలించడానికి కళాజాత చేయాలన్నారు. సమీక్షలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.