గజ్వేల్ అర్బన్, డిసెంబర్ 10: గజ్వేల్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు పథకాల్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు కార్యక్రమాన్ని అధికారికంగా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి చేతులమీదుగా ప్రారంభించారు. ఆదివారం గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ హాజరై గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, సిద్దిపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్తో కలిసి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను ప్రభుత్వం రూ.5లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచిందని, పేదలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన ఆర్ఎంవో డాక్టర్ రాము, డాక్టర్ రాజేశ్, కౌన్సిలర్లు వంటేరు గోపాల్రెడ్డి, బొల్లిపల్లి బాలమణి శ్రీనివాస్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి నక్క రాములుగౌడ్, దవాఖాన ఆరోగ్యశ్రీ సిబ్బంది వెంకట్రెడ్డి, నర్సింహులు, నరేందర్, గంగాల సురేందర్, సంతోష్, మహేందర్, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.