కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని, వాటిని భయభ్రాంతులకు గురిచేయడం.. దాడి చేయడం వంటి పనులు చేయకుండా ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో జంతు హింస నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుక్కల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యా శాఖ రిసోర్స్ పర్సన్లు, ఎంపీవోలు, స్వయం సహాయక సంఘాలు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో టీఏంసీలకు గూగుల్ మీట్ ద్వారా శిక్షణ ఇవ్వాలని పశుసంవర్ధక శాఖాధికారికి సూచించారు. మెదక్లో నిర్మిస్తున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
మెదక్, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : వీధి కుకలతో ప్రజలు అప్రమత్తం ఉండాలని కలెక్టర్ రాజర్షిషా విజ్ఞప్తి చేశారు. బుధవారం తన చాంబర్లో జంతు హింస నివారణ కమిటీ సమావేశంలో వీధి కుకలు, కోతల బెడద నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుక కాటు నుంచి స్వీయ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వాటికి దగ్గరగా నడుస్తూ భయపెట్టి రాళ్లు, కర్రలతో దాడిచేస్తే మన మీదకు కరవడానికి వస్తాయని, అదేవిధంగా చిన్న కుక పిల్లల దగ్గరకు వెళితే తల్లి కుక కరిచే ప్రమాదముందని, ఇట్టి విషయాన్ని పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కలిగించాలన్నారు.
కుకల బారిన పడకుండా రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని పనులపై విద్యాశాఖ రిసోర్స్ పర్సన్లకు, ఎంపీవోలకు, స్వయం సహాయక సంఘాలకు, పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపాలిటీల్లో టీఏంసీలకు గూగు ల్ మీట్ ద్వారా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలని పశు సంవర్ధక శాఖాధికారులకు సూచించారు. వీధి కుకల బెడదను దృష్టిలో పెట్టుకొని చికెన్, మటన్ షాపులు, ఫంక్షన్ హాళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను బయట వేయకుండా ఏజెన్సీ నిర్వాహకులు తీసుకుపోయేలా పర్యవేక్షించాలన్నారు.
ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి కుకలు, కోతులు రాకుండా రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని రవాణా, పోలీసు శాఖాధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో వెంకట శైలేశ్, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్ గౌడ్, డీఈవో రాధాకిషన్, పశు సంవర్ధక శాఖ అధికారి విజ య శేఖర్ రెడ్డి, సహాయ సంచాలకులు వెంకటయ్య, జిల్లా అటవీ అధికారి రవి ప్రసా ద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నవీన్ బాబు, వాణిజ్య పన్నుల అధికారి రాంచందర్, మున్సిపల్ కమిషనర్లు మోహన్, ఉమాదేవి పాల్గొన్నారు.