మెదక్ రూరల్, డిసెంబర్ 1: మాతాశిశు సంరక్షణకు కృషి చేస్తున్న మహిళా,శిశు సంక్షేమ శాఖలో కొలువులు భర్తీ కొనసాగుతున్నయి. ఇటీవల అంగన్వాడీ టీచర్లు, ఆయాలను ప్రభుత్వం నియమించింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉద్యోగోన్నతికి ఎదురుచూసిన అంగన్వాడీ టీచర్లతో ఐసీడీఎస్ ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న గ్రేడ్ -2 సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేసింది. వీటి భర్తీకి గతేడాది నవంబర్లో నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పదేండ్ల్ల పాటు టీచర్గా విధులు నిర్వహించిన అంగన్వాడీ టీచర్లకు ఈ నియామకంలో అవకాశం కల్పించింది. వీరికి రాత పరీక్షను గత జనవరిలో నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసింది. ఎంపిక విధానంపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. కొన్ని రోజుల కిత్రం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో న్యాయవివాదం పరిష్కారమైంది. దీంతో యుద్ధ్దప్రాతిపదికన పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన వారికి రాష్ట్ర మహిళా సంక్షేమశాఖ సూచన మేరకు మెదక్ జిల్లా సంక్షేమశాఖ అధికారి బ్రహ్మాజీ సోమవారం ఉద్యోగ నియామక ఉతర్వులు అందజేశారు.
మంగళ, బుధవారం వీరికి కలెక్టరేట్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. మెదక్ జిల్లా నుంచి మొత్తం 19 మంది గ్రేడ్-2 సూపర్వైజర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారిలో 9మంది సొంత జిల్లావారికి పోస్టింగ్లు ఇక్కడే లభించగా, ఖాళీగా ఉన్న 10 పోస్టుల్లో మిగితా జిల్లాలకు చెందిన వారు నియమితులయ్యారు. కొత్త ఉద్యోగుల రాకతో ఐసీడీఎస్లో సూపర్వైజర్ల కొరత తీరనున్నది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వీరి బేసిక్ వేతనం కేవలం రూ.14 వేలు మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూ.26,410కి పెంచింది. అంగన్వాడీ టీచర్లు పట్టుదలతో చదివి గ్రేడ్-2 సూపర్వైజర్లు కొలువులు సాధించారు. వారి దశాబ్దాల కల నెరవేరడంతో ఉత్సాహంగా ఉద్యోగాల్లో చేరారు. ఇకపై తోటి టీచర్లకు సూచనలు, సలహాలు అందిస్తూ సేవలను పర్యవేక్షించనున్నారు.
మాతాశిశు సంరక్షణకు అంగన్వాడీల కృషి..
మాతాశిశు సంరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. దీంట్లో భాగంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న గర్భిణులు, బాలింతలు సంతులిత ఆహారం తీసుకునేలా ప్రత్యేక కార్యాచరణ అమలుచేసున్న ది.అంగన్వాడీ కేంద్రానికి వచ్చే గర్భిణులు, బాలింతలు చిన్నారులు పోషణ లోపంతో బాధపడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం అందిస్తున్నది. కొంతమంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికోసం అనేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మెదక్ జిల్లాలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, అల్లాదుర్గంలో ఉన్నాయి. 885 అంగన్వాడీ కేంద్రాలు, 191 మినీ కేంద్రాలు ఉన్నాయి.
కేసీఆర్ సారు హామీ నెరవేర్చారు
నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. సీఎం కేసీఆర్ సారు మాకు ఉద్యోగోన్నతి కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు పదోతరగతి పాసైనా కొలువులు ఇస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నెరవేర్చారు. కష్టపడి చదివి కొలువు సాధించాను. మెదక్ జిల్లాలో సూపర్వైజర్ పోస్టు రావడం సంతోషంగా ఉంది.
– శ్రీదేవి, సూపర్వైజర్ రామాయంపేట్ ప్రాజెక్టు, మెదక్ జిల్లా
సంతోషంగా ఉంది..
నేను అంగన్వాడీ టీచరుగా విధు ల్లో చేరి చిన్నారులు, గర్భిణులకు సేవ చేశా. ఇప్పుడు గ్రేడ్-2 సూపర్వైజర్గా ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఉద్యోగం సాధించాలని పట్టుదలతో చదివాను. మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టులో పోస్టింగ్ రావడం అదృష్టంగా భావిస్తున్నా. నా సెక్టర్లో మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తా.
– మంజుల, సూపర్వైజర్ మెదక్ ప్రాజెక్టు
తల్లీబిడ్డల సంక్షేమానికి పాటుపడాలి..
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల సంక్షేమానికి కృషి చేస్తున్నది. అంగన్వాడీ టీచర్లకు సముచిత స్థానం కల్పించి, వేతనాలు పెంచింది. ఇటీవల ఐసీడీఎస్లో సూపర్వైజర్లుగా అర్హులకు ఉద్యోగోన్నతి కల్పించింది. జిల్లాలో ఖాళీల భర్త్తీ ప్రక్రియ పూర్తికావడంతో అన్ని సమస్యలు దూరం కానున్నాయి. సిబ్బంది తల్లీబిడ్డల సంక్షేమానికి బాధ్యతాయుతంగా పాటుపడాలి.
– బ్రహ్మాజీ, ఐసీడీఎస్ జిల్లా అధికారి మెదక్