రామాయంపేట,జూన్24 : చెరువులో దూకి ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట పట్ణణంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రామాయం పేట పట్టణానికి చెంఇన చెందిన మర్కు రామవ్వ అనే వృద్ధురాలు ఇంట్లో గొడువ పడి స్థానికంగా ఉన్న మల్లెచెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అక్కడే క్రికెట్ ఆడుతున్న అరుణ్కుమార్ అనే యువకుడు గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాణాలకు తెగించి సాహసంతో చెరువులో దూకి వృద్ధురాలిని కాపాడాడు. వృద్ధురాలి ప్రాణాలు కాపాడిన అరుణ్కుమార్ను స్థానికులు, పోలీసులు అభినందించారు.