పటాన్చెరు, ఏప్రిల్ 14: ఇస్నాపూర్లో అంబేద్కర్ 12 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముత్తంగి రింగ్ రోడ్డు నుంచి పటాన్చెరు మండల వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు ర్యాలీగా బయలు దేరి వచ్చాయి. గూడెం మహిపాల్రెడ్డితో కలసి తీసిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారీ బాణాసంచా కాల్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ప్రత్యేకమైన లైటింగ్తో విగ్రహావిష్కరణ సంబురాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందన్నారు. పటాన్చెరులోని పాటి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న స్టేడియానికి అంబేద్కర్ పేరు పెడుతున్నామన్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీతో పాటు అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.సత్యనారాయణ, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, వైస్ ఎంపీపీ స్వప్న శ్రీనివాస్, మాజీ ఎంపీపీలు యాదగిరియాదవ్, శ్రీశైలంయాదవ్, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, ఆదర్శ్రెడ్డి, నగేశ్, మండల పార్టీ అధ్యక్షులు పాండు, సర్పంచ్లు గడ్డంబాలామణి శ్రీశైలం, ఉపేందర్ ముదిరాజ్, సుధీర్రెడ్డి, భాగ్యలక్ష్మి, జగన్, మాణిక్రెడ్డి, కృష్ణయాదవ్, ఎంపీటీసీలు మన్నెరాజు,బీ వెంకట్రెడ్డి, మెరాజ్ఖాన్, గడ్డయాదయ్య, బండరాజు, రామకృష్ణ ముదిరాజ్, ఆబేద్, తదితరులు పాల్గొన్నారు.