మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 13: అంబేద్కర్ ఆదర్శప్రాయుడని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు అంబేద్కర్ కృషి చేశారన్నారు. రాజ్యాంగ శిల్పిగా అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించడంతో ఈ రోజు అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారన్నారు. తెలంగాణ ప్రభు త్వం దళిత, బడుగు, బలహీన వర్గాల ఆభ్యున్నతికి పని చేస్తున్నదని, అందుకోసమే సీఎం కేసీఆర్ దళిత బహుజనుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టరన్నారు.
ఆ మహానుభావుడి విగ్రహావిష్కరణలో పాలుపంచుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, కౌన్సిలర్లు వసంత్, రాజలింగం, కోఆప్షన్ సభ్యుడు ఉమర్, మాజీ కౌన్సిలర్ ఏనుగుల యశోదరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి శంకర్, దళిత సంఘాల నాయకులు సంజీన్, ఎర్ర శంకర్, భాస్కర్, ప్రసాద్, లింగం, యాదగిరి, ఇస్మాయిల్ శంకర్ రాజు పాల్గొన్నారు.