జహీరాబాద్, డిసెంబర్ 27: గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, ధరణిలో భూసమస్యలు పరిష్కరించి, కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నా రు. మంగళవారం రాత్రి ఝరాసంగం మండలంలోని బిడెకన్న గ్రామం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధరణిలో పరిష్కరించిన భూములకు పట్టా పుస్తకా లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. బిడెకన్న గ్రామంలో 264 ఎకరాల భూము లు, 146మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకా లు లేకుండే అని, రైతుల సమస్య తెలుసుకొని కలెక్టర్ శరత్తో మాట్లాడి గ్రామంలో మీసేవ కేంద్రం ఏర్పాటు చేసి, కొత్తగా 146మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు కావడం, ఆన్లైన్లో భూమి వివరాలు ఉండడంతో రైతుబంధు, రైతుబీమా అందననున్నదని చెప్పారు.
గ్రామంలో ఎలాం టి భూ సమస్యలు లేకుండా కలెక్టర్ శర త్, అడిషనల్ కలెక్టర్ వీ రారెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. పైసా ఖర్చు లేకుండా రైతులకు పట్టా పుస్తకాలు ఇచ్చామని చెప్పారు. దీం తో మంత్రి హరీశ్రావును రైతులు ఎడ్లబండిపై ఊరేగించారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రా వు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఉమ్మ డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, కలెక్టర్ శరత్, అడిషనల్ కలెక్టర్లు రాజార్షి షా, వీరారెడ్డి, సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, తన్వీర్, గోవర్ధ న్ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.