గజ్వేల్/గజ్వేల్అర్బన్/వర్గల్/ములుగు/మర్కూక్/ జగదేవ్పూర్: నవంబర్ 28 : గజ్వేల్ దారులన్నీ సీఎం కేసీఆర్ సభతో
గులాబీమయంగా మారాయి. ఎన్నికల్లో భాగంగా మంగళవారం గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ పక్కనగల మైదానంలో బీఆర్ఎస్
అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ నిర్వహించారు. మధ్యా హ్నం 12 గంటల నుంచే సీఎం సభాస్థలికి వివిధ వాహనాల్లో
నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు.ఎటు చూసినా దారులన్నీ గులాబీమయంగా
మారాయి. పట్టణ ప్రధాన రోడ్లతో పాటు గల్లీ,గల్లీ రోడ్లు జనసంద్రమయ్యాయి. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు సీఎం కేసీఆర్
ప్రజాఆశీర్వాద సభకు తరలివచ్చారు.
నియోజకవర్గంలోని మర్కూక్, వర్గల్, ములుగు, కొండపాక, కుకునూర్పల్లి, జగదేవ్పూర్, తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లోని అన్ని గ్రామా ల నుంచి వేలాదిగా ప్రజలు సభకు వచ్చారు. రోడ్లపై, పక్కనే ఉన్న దుకాణాలు, పెద్దపెద్ద భవనాలపై నుంచి ప్రజలు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విన్నా రు. ప్రజాకళాకారులు ఏపూరి సోమన్న, మధుప్రియ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. రేవంత్రెడ్డిని ఉద్దేశిస్తూ బైబై రేవంత్ నువ్వొచ్చుడొద్దు అంటూ కళాకారుడు మానకొండూరు ప్రసాద్ పాడిన పాటతో ప్రజలు జై కేసీఆర్ అంటూ రాగం కలిపారు. కేసీఆర్ గజ్వేల్కు వస్తున్నాడని తెలుసుకున్న పలువురు మహిళలు చంటిపిల్లలతో సహా సభకు తరలివచ్చి కేసీఆర్ప్రసంగాన్ని శ్రద్ధగా వినడం కనిపించింది.
సీఎం కేసీఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ గజ్వేల్లోని సభాస్థలిపై ఎగురుతుండడం చూసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దపెట్టున
జైకేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కిందికి దిగుతున్న హెలికాప్టర్ శబ్దానికి రెట్టింపుగా ప్రజల నినాదాలు ఆకాశాన్నంటాయి.
గజ్వేల్ అంతా జైకేసీఆర్ నినాదాలతో మారు మోగింది. కింది నుంచి భారీగా నినాదాలు చేస్తున్న కార్యకర్తలను చూసి సీఎం
కేసీఆర్ పై నుంచే అభివాదం చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మాజీ శాసనమండలి స్పీకర్
మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు డాక్టర్ యాదవరెడ్డి, బండ ప్రకాశ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీచైర్పర్సన్లు
హేమలతశేఖర్రెడ్డి, రోజాశర్మ, మాజీ జడ్పీ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డీసీసీబీ చైర్మన్ చిట్టిదేవేందర్రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ
సుధాకర్రెడ్డి, గజ్వేల్,తూప్రాన్ మున్సిపల్ చైర్మన్లు ఎన్సీ రాజమౌళి, రవీందర్గౌడ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి,
ఎలక్షన్రెడ్డి, గజ్వేల్, ములుగు ఏఎంసీ చైర్మన్లు మాదాసు శ్రీనివాస్, జహంగీర్పాల్గొన్నారు.