గజ్వేల్/ములుగు, డిసెంబర్ 13: కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, అర్బన్ కిసాన్ ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్తో ఉప కులపతి డాక్టర్ బి.నీరజాప్రభాకర్ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశం ఓక్రా, చిల్లి, చెర్రి, టమాట పంటల పరిశోధన అభివృద్ధిపై దృష్టిసారిస్తూ విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న ఉద్యాన పంటల పరిశోధన సమాచారాన్ని పంచుకుంటాయి. ఈ ఒప్పందంలో అర్బన్ కిసాన్ ఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ తరఫున డాక్టర్ సాయిరాంరెడ్డి, డాక్టర్ భగవన్, రిజిస్టర్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ కిరణ్కుమార్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయ, అర్బన్ కిసాన్ ఫామ్స్ సీఈవో డాక్టర్ శ్రీనివాసన్, నర్సిరెడ్డి, విహరీ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.