పాపన్నపేట, ఆగస్టు 1 : మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని అదనపు కలెక్టర్ నగేష్ రాత్రి 9 గంటల తర్వాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో మమేకమై వారి సామర్థ్యాలను పరిశీలిస్తూ వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయి? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..కార్పొరేట్ స్థాయికి దీటుగా ప్రభుత్వ సంక్షేమ వసతి, గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందుతున్నాయ్నారు. విద్యార్థులు మంచిగా చదువుకుని సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ సూచించారు.