చిలిపిచెడ్/ నర్సాపూర్/ మెదక్ రూరల్, నవంబర్ 24: ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదని అదనపు డీఆర్డీ వో భీమయ్య పేర్కొన్నారు. మండల కేంద్రం చిలిపిచెడ్లోని రైతువేదికలో వరి కొనుగోళ్లపై గురువారం సమావేశం నిర్వహించారు. రైతు లు ధాన్యంలో తాలు, మట్టి, పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలన్నారు. బద్రియతండా, గన్యాతండాల్లో ధాన్యం కేం ద్రాలను ఏపీఎం ప్రేమలతతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఐకేపీ సీసీలు పురుషోత్తం, విజయలక్ష్మి పాల్గొన్నారు.
కేంద్రాలను పరిశీలించిన ఏడీఏ సురేఖ
నర్సాపూర్ మండలం మాడాపూర్ గ్రా మంలో కొనుగోలు కేంద్రాన్ని ఏడీఏ సురే ఖ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బాబ్యానాయక్ పాల్గొన్నారు.
మెదక్ మండలం మగ్ధుంపూర్లో కొనుగోలు కేంద్రాలను ఏవో శ్రీనివాస్ పరిశీలించా రు. ధాన్యం తరలింపు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏఈవో శరణ్య, రైతులు ఉన్నారు.