పనిచేసి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి అండగా ఉండి, భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం చేగుంట మండలంలోని వడియారం ఎస్ఎల్వీఎన్ గార్డెన్లో దుబ్బాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ అధ్యక్షులు, ఓటర్ల ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చీమకు కూడా హానిచేయని ప్రభాకర్రెడ్డి కత్తి పోటుకు గురికావడం బాధాకరమన్నారు. ఆపదలో ఉన్న ప్రభాకర్రెడ్డికి అండగా ఉండి మీరే ఆయనలాగా పనిచేయాలన్నారు.
చేగుంట, నవంబర్ 2: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఎన్నికల్లో కార్యకర్తలు పని చేసి దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డికి అండగా ఉండి, భారీ మోజార్టీతో గెలుపించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారం ఎస్ఎల్వీఎన్ గార్డెన్లో గురువారం దుబ్బాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ అధ్యక్షులు, వందమంది ఓటర్ల ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికల నుంచి నియోజకవర్గంలో కొంతమంది నాయకులు ఉధృక్తకరమైన మాటలు మాట్లాడుతున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. చీమకు కూడా హాని చేయని ప్రభాకర్రెడి కత్తి పోటుకు గురికావడం చాలా బాధాకరమన్నారు. ఈరోజు ఉదయం ప్రభాకర్రెడ్డి వద్దకు వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వెళ్లగా, మాట్లాడడానికి కూడా రావడం లేదని, కన్నీటి ధారలు వస్తున్నాయన్నారు. ఆపదలో ఉన్న ప్రభాకర్రెడ్డికి అండగా ఉండి మీరే ప్రభాకర్రెడ్డిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ తాగునీరు, ప్రాజెక్టులతో వచ్చే సాగు నీటితోపాటు బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్న పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దుబ్బాకలో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. పార్టీలో ఉండి పార్టీకి మోసం చేస్తే కన్న తల్లిని మోసం చేసినట్లేనన్నారు. తెలంగాణ రాకపోతే కాళేశ్వరం వచ్చేది కాదని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఉండేది కాదన్నారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు కూడ రాకపోతుండే అన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయినట్లేనని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ వికారాబాద్ సభలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని, బహిరంగంగా చెప్పుకోవడం, రేవంత్రెడ్డి మూడు గంటల విద్యుత్ సరిపోతుందని చెప్పడం, చూస్తుంటే తెలంగాణలో ఎవరూ కాంగ్రెస్కు ఓటేయరన్నారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్రావు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, డిగ్రీ కళాశాల, నూతన పరిశ్రమలు, ఔటర్ రింగ్రోడ్డు, ఉచిత కార్పొరేట్ దవాఖాన, ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి, రైతులకు రెండు ఎడ్లు బండి, పుస్తే మట్టెలు, స్కిల్ డెవలప్మెంట్ హామీలు ఇచ్చి, గెలిచిన రఘునందన్రావు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. దీంతో దుబ్బాక పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడి పోయిందన్నారు. అలాంటి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కేవలం కొత్త ప్రభాకర్రెడ్డితోనే సాధ్యమన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీశ్రెడ్డి, మనోహర్రావు, మామిడి మోహన్రెడ్డి, వెంకట నర్సింహారెడ్డి, చిందం రాజ్కుమార్, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి, నార్సింగి ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మైలరాం బాబు, దుబ్బాక నియోజక వర్గ బీఆర్ఎస్ నాయకులు భాస్కరాచారి, గజ్జెల సాయిలు, లక్ష్మీలింగం, అంజిరెడ్డి, బి.శ్రీకాంత్రెడ్డి, రొట్టే రాజమౌళి పంతులు, తిమ్మాపూర్ మాధవి, జీడిపల్లి రాంరెడ్డి, హరికృష్ణారెడ్డి, వెంకటేశ్వరశర్మ, యాదగిరి, ఇప్ప దయాకర్, నర్సింహారెడ్డి, శ్రీనివాస్గుప్తా, బోనాల శ్రీనివాస్, కొత్త పుష్పలత కిషన్రెడ్డి, రవీందర్రెడ్డి, గన్నె వనితాభూంరెడ్డి, రణం జ్యోతి శ్రీనివాస్గౌడ్, వెంకట్రెడ్డి, నారాయణరెడ్డి, తానీషా, కొండల్రెడ్డి, రాజిరెడ్డి, వేణుగోపాల్శర్మ తదితరులు పాల్గొన్నారు.
వడియారం ఎస్ఎల్వీఎన్ గార్డెన్లో దుబ్బాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమక్షంలో దుబ్బాక నియోజకవర్గం నుంచి వివిధ మండలాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు వెయ్యిమంది మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.