మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్ కార్యాలయంలో ధరణి డాటాఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న వేణురెడ్డి మంగళవారం ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో తహసీల్ కార్యాలయం వద్ద మెదక్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
కౌడిపల్లి, ఫిబ్రవరి 21: మెదక్ జిల్లా కౌడిపల్లి మండ ల తహసీల్ కార్యాలయంలో ధరణి డాటా ఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న వేణురెడ్డి మంగళవారం ఓ రైతు వద్ద రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తహసీల్ కార్యాలయం వద్ద మీడియాకు మెద క్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ వివరాలు వెల్లడించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రైతు నీరుడు పోచయ్య తా ను కొనుగోలు చేసిన 10గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు డాటా ఎంట్రీ ఆపరేటర్ వేణురెడ్డి రూ. 20వేల లం చం డిమాండ్ చేశాడు. బాధిత రైతు జనవరి 25న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రైతు వద్ద డబ్బులు లేకపోవడంతో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆగాడు.
లంచం డబ్బులు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తానని వేణు చెప్పాడు. దీంతో మంగళవారం కార్యాలయానికి వచ్చి 10గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వేణు ఒప్పుకున్న ప్రకారం 20వేల రూపాయలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. తన స్నేహితుడు కేతావత్ రాజునాయక్కు డబ్బులు ఇవ్వాలన్నాడు. కార్యాల యం ముందు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం కోసం వేధిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. వేణురెడ్డి స్వగ్రామం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ. ఏసీబీ దాడులు కౌడిపల్లి తహసీల్ కార్యాలయంలో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 9వరకు విచారణ చేపట్టారు.