అల్లాదుర్గం, మార్చి 22: ఒంటిపై పది కిలోల బంగారు ఆభరణాతో పూజాకార్యక్రమానికి హాజరైన వ్యక్తి అందరినీ ఆకట్టుకున్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం జరిగిన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్కు చెందిన హోప్ ఫౌండేషన్ చైర్మన్, తెలంగాణ హాకీ ఫెడరేషన్ చైర్మన్ కొండా విజయ్కుమార్ వచ్చారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగడానికి భక్తులు ఆసక్తి కనబర్చారు.