కంది, ఏప్రిల్ 5: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలతో పాటు అనేక హామీలిచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు. గ్యారెంటీల అమలుతో పాటు రైతులకు రూ.2లక్షల పంట రుణమాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రమైన సంగారెడ్డిలో రైతు సత్యాగ్రహ దీక్షను నిర్వహించారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ.. మాట తప్పిన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం రైతుల సమస్యలు తెలుసుకునేందుకు టోల్ఫ్రీ నెంబర్ 99041 19119 ఏర్పాటు చేసిందని, ఈ నంబర్ ఉపయోగించుకోవాలని కోరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా రైతులకు రుణమాఫీ చేయడం లేదని, రైతుబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రవీందర్, రమేశ్, చంద్రశేఖర్, నాయకులు గురువారెడ్డి, మాణిక్రావు, అనంతరావు, జగన్, రవి, వాసు, రైతులు పాల్గొన్నారు.