పాపన్నపేట, జనవరి 22: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గాభవానీ మాత సన్నిధి ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయలకు చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏడుపాయల ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, రవివీర్కుమార్, తోట నరసింహులు, యాదాగౌడ్, బత్తిని రాజు, వరుణాచారి, మహేశ్ తదితరులు ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ, రాముశర్మ, రాజశేఖర్శర్మ, మురళీశర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఏడుపాయల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు.